

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతోనే తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా భూస్థాపితం అయిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు నోటీసుల పేరుతో మున్సిపల్ ఎన్నికల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుగుదలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావుకి నిరంతరం అసహనం ఉందని, అందుకే ట్వీట్లు, ప్రెస్ మీట్ల ద్వారా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన వ్యక్తి హరీష్ రావు అయితే, రాజకీయాల్లో ఒక్కో మెట్టు చొప్పున ఎదుగుతూ పైకి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో “లక్కీ స్టార్” హరీష్ రావేనని వ్యాఖ్యానిస్తూ, కవితే కేసీఆర్ దగ్గర నుంచి పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పిందని గుర్తుచేశారు. ఇంట్లో ఉన్నవారందరికీ ఉద్యోగాలు ఇప్పించిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు ఉద్యోగాలపై పిట్టకథలు చెబుతోందని విమర్శించారు. గద్దరు, ఈటల రాజేందర్, కోదండరాం లాంటి నేతలను అవమానించినప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!