
సినిమాలు

తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించారు. మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయినందున అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. అలాగే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కోసం పాల్వంచలో స్థలం గుర్తించామని, అక్కడ OLS సర్వే మరియు ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
అంతర్గాం ఎయిర్పోర్ట్కు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం అభ్యర్థించారు. అదిలాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణకు సంబంధించి అదనంగా 249.82 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రాంతీయ కనెక్టివిటీ, పెట్టుబడుల ప్రోత్సాహం దృష్ట్యా కొత్త ఎయిర్పోర్టులు అత్యవసరమని సీఎం పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!