
జనరల్

జాతీయ పంచాయతీ అవార్డులు - 2026 లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ పాలనలో పారదర్శకత, మెరుగైన సేవలందించడంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు. ఈ విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
వాతావరణ పరిరక్షణ ప్రత్యేక పంచాయతీ విభాగంలో కందులవారి పల్లె దేశంలోనే తొలి స్థానం సాధించగా, స్వయం సమృద్ధి ప్రత్యేక పంచాయతీ అవార్డులో కాణిపాకం రెండో స్థానం దక్కించుకుంది. అలాగే పంచాయతీ సామర్థ్య నిర్మాణంలో అత్యుత్తమ సంస్థ విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!