

శ్రీశైలంలో శివ మాలధారులపై లాఠీ ఛార్జీ జరగడంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్రంగా స్పందించారు. అదనపు ఎస్పీ ఆదేశాలతో లాఠీ ఛార్జీ నిర్వహించడాన్ని ఆయన ఖండించారు. శైవ భక్తుల పట్ల అధికారులు సంయమనం పాటించాలని హితవు పలికారు. మాలధారణ చేసిన భక్తులు ఇరుముడులతో స్వామివారి దర్శనానికి వస్తారని, వారికి సహకరించాల్సిన యంత్రాంగమే సంయమనం కోల్పోతే ఎలా అని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
శ్రీశైలం దేవస్థానం పాలక మండలి ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!