

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు మహిళా సాధికారతకు నూతన దశను తెరుస్తుందని తెలిపారు. ఈ బిల్లు పార్లమెంట్లో అన్ని పార్టీల మద్దతుతో ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల సామాజిక, రాజకీయ భవిష్యత్తును మార్చే కీలక అడుగుగా దీనిని ఆయన అభివర్ణించారు.
2023 లో నారీ శక్తి వందన్ చట్టాన్ని ఏకాభిప్రాయంతో ఆమోదించిన విషయాన్ని గుర్తుచేస్తూ, దాని అమలులో ఉన్న ఆలస్యాలను ప్రభుత్వం తొలగించిందన్నారు. 33 శాతం రిజర్వేషన్ల అమలుకు 2033 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, 2029 నుంచే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా మహిళలు ఈ బిల్లుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, పార్లమెంట్ చర్చలను ఆసక్తిగా వీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు అవసరం లేవని, ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా అన్ని ప్రక్రియలు జరుగుతాయని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!