
రాజకీయాలు

తిరుపతి సమీపంలోని రేణిగుంట ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనపై తప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురిచేశారని అన్నారు. అయితే సత్యం తనవైపు ఉండటం, దేవుడి దయతో కోర్టు ఆ కేసులో తనను డిశ్చార్జ్ చేసిందని పేర్కొన్నారు.
వేంకటేశ్వర స్వామిపై తమ కుటుంబానికి అపారమైన భక్తి ఉందని, కేసు నుంచి విముక్తి లభిస్తే కాలి నడకన స్వామివారిని దర్శించుకుంటామని మొక్కు పెట్టుకున్నామని చెప్పారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి సభ్యులతో కలిసి తిరుపతికి వచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తమ శ్రేయోభిలాషులు వచ్చి స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!