

నెట్ఫ్లిక్స్ మోస్ట్ అవేటెడ్ రియాలిటీ డ్రామా దేశీ బ్లింగ్ అధికారికంగా స్ట్రీమింగ్ ప్రారంభించింది. దుబాయ్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ షోలో క్రేజీ సెలబ్రిటీ జోడీ తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన సంపన్న భారతీయుల విలాసవంతమైన జీవనశైలి, హై-ఎండ్ ఫ్యాషన్, ఖరీదైన కార్లు, లగ్జరీ పెంట్హౌస్లు ఈ సిరీస్లో ప్రధాన హైలైట్స్గా కనిపించనున్నాయి.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్లో రిలేషన్స్, బిజినెస్ రైవల్రీ, సోషల్ స్టేటస్ వంటి అంశాలను చూపించనున్నారు. ముఖ్యంగా తేజస్వి-కరణ్ జోడీ మధ్య కెమిస్ట్రీపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. వీరిద్దరి పెళ్లి గురించి ఏదైనా ప్రత్యేక ప్రకటన ఈ షోలో ఉండొచ్చనే రూమర్స్ మరింత హైప్ తీసుకొచ్చాయి. గ్లోబల్ రియాలిటీ షోల తరహాలో రూపొందిన ఈ సిరీస్, ఇండియన్ ఎమోషన్స్తో ప్రత్యేకంగా ఉండబోతోందని నెట్ిజన్లు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!