
జనరల్

ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారత్ ఇప్పటికీ దిగువ మధ్య ఆదాయ దేశంగా ఉన్నప్పటికీ, తెలంగాణ ఎగువ మధ్య ఆదాయ రాష్ట్రంగా నిలిచింది. దేశ తలసరి ఆదాయం రూ.2,63,179గా ఉండగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.5,15,583గా నమోదైందని నివేదిక వెల్లడించింది. ఈ ప్రదర్శనతో తెలంగాణ దేశంలోని ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ వంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రాల సరసన నిలిచింది.
నివేదిక ప్రకారం తెలంగాణ ఆర్థిక స్థాయి ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల ఆదాయ స్థాయిని అధిగమించింది. మరోవైపు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పలు అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే వెనుకబడి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. భారత రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!