
క్రీడలు

సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన కరుప్పు చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుని భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూర్య కెరీర్లోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, ప్రస్తుతం తమిళం మరియు తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!