
టాలీవుడ్లో ఇటీవల విడుదలైన యూత్ఫుల్ డ్రామా నవాబ్స్ కేఫ్ సినిమా రిలీజ్కు ముందే మంచి ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రంలో శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుని యావరేజ్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఈటీవీ విన్’లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు ప్రమోద్ హర్ష వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాతబస్తీలో ఉన్న ఒక పాత కేఫ్ను దేవాలయంలా భావించే తండ్రి, ఆ కేఫ్ను అమ్మేసి అమెరికాకు వెళ్లి స్థిరపడాలని కోరుకునే కొడుకు మధ్య జరిగే భావోద్వేగ ఘర్షణ ఈ సినిమా కథగా చూపించారు.
ఈ సినిమాలో ముఖ్యంగా రాజీవ్ కనకాల నటన ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. థియేటర్లలో సాధారణ స్పందన పొందిన ఈ చిత్రం ఓటీటీలో ఎలా ఆదరణ పొందుతుందో చూడాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!