

అలివేరు సమీపంలోని జల్లేరు జలాశయం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన తుమ్మల నాగరాజు (30), తుమ్మల రమణ (35) కుటుంబ సభ్యులతో కలిసి బుట్టాయిగూడెం మండలంలోని కామవరం అటవీ ప్రాంతం వద్ద ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం బంధువులు, స్నేహితులతో కలిసి సమీపంలోని జల్లేరు జలాశయానికి సరదాగా గడపడానికి వెళ్లారు.
అక్కడ స్నానం చేయడానికి నీటిలోకి దిగిన నాగరాజు, రమణ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఇది గమనించిన బంధువులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో జలాశయంలో గాలింపు చేపట్టి నాగరాజు, రమణ మృతదేహాలను వెలికితీశారు.
ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.








.jpeg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!