

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను పెంచింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు జరగగా, ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో పలువురు అమెరికా సైనికులు గాయపడ్డారు, యుద్ధ విమానాలు కూడా దెబ్బతిన్నాయి. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. రియాద్పై లక్ష్యంగా పెట్టిన క్షిపణులు, డ్రోన్లను సౌదీ అరేబియా కూల్చివేసినట్లు తెలిపింది. కువైట్లోని కొన్ని వాణిజ్య భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు హర్మూజ్ జలసంధి గుండా మానవతా సహాయం, వ్యవసాయ సరుకుల రవాణాకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. నెల రోజుల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇరాన్లోని క్షిపణి తయారీ కేంద్రాలు, ఆయుధ తయారీ యూనిట్లు, అణు సంబంధిత కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. దీనికి ప్రతిగా టెల్ అవీవ్పై గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!