
క్రీడలు
నగరంలోని హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్పేట్ నుంచి రాయదుర్గం మార్గంలో మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈరోజు (శుక్రవారం) ఉదయం సాంకేతిక లోపం కారణంగా జూబ్లీ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్ వద్ద ఒక మెట్రో రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో అమీర్పేట్ నుంచి రాయదుర్గం వైపు, అలాగే రాయదుర్గం నుంచి అమీర్పేట్ వైపు రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
మాదాపూర్, హైటెక్ సిటీ స్టేషన్ల వద్ద కూడా రైళ్లు నిలిచిపోయినట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే మెట్రో అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో మెట్రో సేవల్లో తరచుగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






.jpg&w=3840&q=75)


.jpg&w=3840&q=75)







.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!