

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతి, విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని శాఖమూరు ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఉదయం 11:15 గంటలకు ఆవిష్కరించనున్నారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించేందుకు ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఆయన 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ స్మారక ప్రాజెక్టు సుమారు 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6.80 ఎకరాల విస్తీర్ణంలో రూపొందుతోంది. మొదటి దశ పనులను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుముతో విగ్రహాన్ని నిర్మించారు. రెండో దశలో ఇక్కడ సంగ్రహాలయం, చిత్ర ప్రదర్శన గది, సభా మందిరం, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం విజయవాడలో ప్రభుత్వం తరపున నిర్వహించే ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.








.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!