

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ట్రూకాలర్ ఇండియా ఇన్సైట్ రిపోర్ట్ – 2025 వెల్లడించింది. సాధారణ ఎస్ఎంఎస్, ఫోన్ కాల్స్ కంటే ఇప్పుడు నేరగాళ్లు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్, టెలీగ్రామ్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఫేక్ కరెంట్ బిల్లులు, ట్రాఫిక్ చలాన్లు వంటి సందేశాలు పంపి డబ్బు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రూకాలర్ వినియోగదారుల ద్వారా 4,168 కోట్ల స్పామ్ కాల్స్, 12,903 కోట్ల స్పామ్ మెసేజ్లు గుర్తించబడ్డాయి. వాటిలో 770 కోట్ల కాల్స్ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, పేమెంట్ ప్లాట్ఫామ్లు, ప్రముఖ బ్రాండ్లు పేరుతో మోసం చేయడానికి చేసినవే.
స్కామర్ల ప్రధాన లక్ష్యం వృద్ధులేనని నివేదిక చెబుతోంది. వారు సులభంగా మోసపోతారని, జరిగిన విషయం బయటకు చెప్పకపోవచ్చని భావిస్తున్నారు. కమ్యూనిటీ రిపోర్టింగ్ సహాయంతో ట్రూకాలర్ 1,189 కోట్ల స్పామ్ కాల్స్ను వినియోగదారులకు చేరకుండా అడ్డుకుంది. ఒక్కో స్పామ్ కాల్ సగటుగా 1.8 నిమిషాలు అనుకుంటే, రోజుకు సుమారు 21.7 లక్షల గంటలు, వారానికి 1.5 కోట్ల గంటల సమయాన్ని సేవ్ చేసినట్టు తెలిపింది. ఈ నివేదిక 32 కోట్ల మంది వినియోగదారుల డేటా ఆధారంగా తయారైంది.
ఇక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సమాచారం ప్రకారం, 2025 లో భారతీయులు మోసాల వల్ల రూ. 19,813 కోట్లు కోల్పోయారు. దీనిపై 21.77 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. అధునాతన సాంకేతికతతో జరుగుతున్న ఈ మోసాలను గుర్తించడం కష్టమవుతోంది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!