.jpg&w=3840&q=75)

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.9 వేల కోట్లను కేటాయించింది. మొదటి విడతగా రూ.3,590 కోట్లు విడుదల కాగా, ఇవి సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమవుతాయి. రాష్ట్రంలో సుమారు 73 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగే కార్యక్రమంలో సీఎం ఈ నిధులను విడుదల చేయడంతో పాటు ఆయిల్ పామ్ కర్మాగారాన్ని కూడా ప్రారంభించనున్నారు. రూ.300 కోట్లతో నిర్మించిన ఈ కర్మాగారం రాష్ట్రంలో మూడోది కాగా, ఉత్తర మరియు దక్షిణ తెలంగాణలోని 18 జిల్లాల రైతులకు ప్రయోజనం కలిగించనుంది. అదనంగా రూ.80 కోట్లతో రిఫైనరీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు.
ఇక పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త బోనస్ విధానాన్ని ప్రకటించే అవకాశముంది. వరి, పత్తి వంటి ప్రధాన పంటలతో పాటు నూనెగింజలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.






.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!