
.jpeg&w=3840&q=75)
హరీష్ రాణా కారుణ్య మరణం కేసు తీర్పు వెలువరించే సమయంలో సుప్రీంకోర్టులో భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది. తీర్పును చదువుతూ జస్టిస్ జేబీ పార్దివాలా తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రమాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ముందు రాణా ఎంతో తెలివైన యువకుడని పేర్కొంటూ కన్నీళ్లతో కేసు పరిస్థితులను వివరించారు. జడ్జి భావోద్వేగానికి గురవడంతో కోర్టు హాల్లో ఉన్నవారంతా కూడా కదిలిపోయారు.
దాదాపు 13 సంవత్సరాలుగా కోమాలో ఉన్న హరీష్ రాణాకు నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం 2018 కామన్ కాజ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం చికిత్స నిలిపివేయడానికి అనుమతిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన హరీష్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో హాస్టల్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి కోమాలోనే ఉన్న అతడికి చికిత్స చేసినా ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. దీంతో అతని తల్లిదండ్రులు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించగా, ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. చివరకు సుప్రీంకోర్టు మెడికల్ రిపోర్టులు, తల్లిదండ్రుల మనోవేదనను పరిగణలోకి తీసుకుని 2026 మార్చి 11న కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది.









.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!