

భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, “ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా” సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజభవన్లోని గణతంత్ర మండపంలో పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన చూపిన దేశభక్తి, దూరదృష్టి, ఐక్యతా సంకల్పం దేశానికి స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో ఉన్న ‘స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిసింది.
తదుపరి, ఏక్తా దివస్ (National Unity Day) పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్లో సైనిక దళాల కసరత్తులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మోదీ వారికి సెల్యూట్ చేశారు. అనంతరం సాయుధ దళాలు, స్థానిక ప్రజలతో కలిసి ఐక్యతా ప్రమాణం చేశారు. పరేడ్లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా గుజరాత్, జమ్మూ కాశ్మీర్, అండమాన్-నికోబార్, మణిపూర్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి రాష్ట్రాల శకటాలు భారత ఐక్యతను ప్రతిబింబించాయి. సాంస్కృతిక బృందాల నృత్యాలు, సైనిక విన్యాసాలు మరియు జాతీయ గీతాల ప్రదర్శన కార్యక్రమానికి మహత్తరంగా ముగింపు పలికాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (2)
సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి త్యాగం, దూరదృష్టి, ఐక్యతా సందేశం ఈ రోజు కూడా మనందరికీ ప్రేరణ!
Sardar Patel remembered