
ముంబయిలో జరిగిన సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. ఈ ఉదయం ముంబయి చేరుకున్న లోకేష్ దంపతులు సెయింట్ రెజిస్ హోటల్లో నిర్వహించిన వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెండుల్కర్ కుటుంబ సభ్యులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు.
నూతన వధూవరులు అర్జున్ టెండుల్కర్, సానియా చందోక్లను ఆశీర్వదించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరైన ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!