

హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వానికి మహిళలపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. వారిని గుర్తించి కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే మహిళాశక్తి పథకం తీసుకొచ్చామన్నారు.
మహిళల భద్రతకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. మా ప్రభుత్వం వచ్చాక పథకాలు మహిళల పేరు మీదే ఇస్తున్నాం. మహిళల కోసం చట్టాలు చేస్తే ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు. వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడిపిస్తున్నాం. మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!