

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ గర్భిణి మహిళపై జరిగిన దారుణ ఘటన అక్కడి ప్రజలను కలచివేసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్, సిడ్నీలో గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె రెండో శిశువు పుట్టడానికి కూడా కొన్ని వారాలే మిగిలి ఉన్నాయి.
పోలీసుల సమాచారం ప్రకారం, సిడ్నీ హార్న్స్బీలోని జార్జ్ స్ట్రీట్పై సాయంత్రం 8 గంటల సమయంలో సమన్విత తన భర్త, మూడు సంవత్సరాల కుమారుడితో కలిసి నడకకు వెళ్లింది. అప్పుడు రోడ్డు దాటేందుకు వారి కోసం ఒక కియా కార్నివాల్ వాహనం ఆగింది. ఇంతలో వెనకాల నుంచి అధిక వేగంతో వచ్చిన BMW కారు కియా వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో కియా వాహనం ముందుకు తోసుకుపోయి, అచ్చం అదే సమయంలో కార్పార్క్ ప్రవేశం దాటుతున్న సమన్వితపై ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆమెను వెంటనే వెస్ట్మీడ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమెను అలాగే పుట్టబోయే శిశువును కాపాడలేకపోయారు.
BMW కారును నడిపింది 19 ఏళ్ల అరోన్ పపాజోగ్లూ, ప్రొవిజనల్ లైసెన్స్ ఉన్న P-ప్లేట్ డ్రైవర్. పోలీసులు తెలిపిన మేరకు, BMW డ్రైవర్, కియా డ్రైవర్ ఇద్దరికీ గాయాలు కానట్లు తెలుస్తోంది. సమన్విత భర్త, కుమారుడికి గాయాలున్నాయా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. సమన్విత LinkedIn ప్రొఫైల్ ప్రకారం, ఆమె IT సిస్టమ్స్ అనలిస్ట్గా పని చేస్తూ, Alsco Uniforms లో టెస్ట్ అనలిస్ట్గా పనిచేస్తోంది.
పోలీసులు తరువాత పపాజోగ్లూను అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఆయనపై dangerous driving causing death, negligent driving causing death, అలాగే గర్భంలో ఉన్న శిశువు మృతికి కారణమవడం వంటి తీవ్రమైన కేసులు పెట్టారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మేజిస్ట్రేట్ ఆయన బెయిల్ను తిరస్కరించారు.
2022లో న్యూసౌత్ వేల్స్లో అమలులోకి వచ్చిన Zoe’s Law ప్రకారం, ప్రమాదకర డ్రైవింగ్ వల్ల గర్భంలో ఉన్న శిశువు మరణిస్తే అదనంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఈ కేసులో కూడా అదే చట్టం వర్తించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!