
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గన్నవరంలో జరిగిన ప్రధానమంత్రి రైతు సాయం మరియు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,670 కోట్లను నేరుగా జమ చేశారు. రైతులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గువాహటిలో నుంచి చేసిన ప్రసంగాన్ని ఆయన వీక్షించారు.
ఎన్నికల హామీ ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకూ తోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలును కలిపి రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన మొత్తంతో పోలిస్తే తమ ప్రభుత్వం రైతులకు మరింత సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి త్వరలో కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ సలహా సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!