

పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. అల్పాహారం తీసుకున్న అనంతరం 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని మారేడుమిల్లి, రంపచోడవరం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఘటనపై విచారణ కోసం జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, ఆహారం మరియు నీటి నమూనాలను సేకరించినట్లు తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనపై పూర్తి నివేదికను రేపటిలోగా సమర్పించాలని కలెక్టర్ను ఆదేశించిన ఆయన, నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు.




.jpg&w=3840&q=75)








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!