

భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చంద్రబాబు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.. జాతీయవాదాన్ని పునాదిగా చేసుకుని దేశ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్న ఈ పార్టీ, మన సంస్కృతి మరియు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, సమగ్ర అభివృద్ధి మరియు దేశ సేవ కోసం నిరంతరం కృషి చేస్తోంది.
పార్టీ వ్యవస్థాపక నేతల నుండి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వరకు, అలాగే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తన నిర్ణయాత్మక పాలన, ప్రగతి పట్ల ఉన్న నిబద్ధతతో దేశాన్ని మరింత శక్తివంతం చేసింది. ఆంధ్రప్రదేశ్లో రెట్టింపు వేగంతో పనిచేస్తున్న ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందిస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో బీజేపీ దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని, ‘వికసిత్ భారత్’ లక్ష్య దిశగా మన ప్రయాణం మరింత బలపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు తెలియజేశారు.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!