

నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై సమీక్ష నిర్వహించారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ప్రధాన కార్యదర్శి సాయి
ప్రసాద్ తో పాటు ఉన్నతాధికారులతో దూర సంప్రదింపుల ద్వారా పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 బంకులు ఉండగా, సరఫరా కొరత కారణంగా సుమారు 421 బంకులు మూతపడినట్లు అధికారులు తెలిపారు.
సరఫరా పెరిగినా, భయంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్ అధికమైందని అధికారులు వివరించారు. నిన్న రోజున పెట్రోల్ సరఫరా 10,345 కిలోలీటర్లు, డీజిల్ సరఫరా 14,156 కిలోలీటర్లు ఉన్నప్పటికీ అమ్మకాలు సాధారణ స్థాయిని మించాయి. సాధారణంగా 6,330 కిలోలీటర్లుగా ఉండే పెట్రోల్ అమ్మకాలు 8,489 కిలోలీటర్లకు పెరిగాయి. అలాగే డీజిల్ అమ్మకాలు 9,048 కిలోలీటర్ల నుంచి 10,556 కిలోలీటర్లకు చేరాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆక్వా రంగంలో భారీగా కొనుగోళ్లు జరుగుతున్న సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్లు, సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రానికి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు.











.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!