

ట్రంప్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. చట్టవిరుద్ధంగా వసూలు చేసిన సుంకాలను దిగుమతిదారులకు తిరిగి ఇవ్వాలని అమెరికా వాణిజ్య కోర్టు ఆదేశించింది. గత నెలలో సుప్రీంకోర్టు ఈ సుంకాలు చట్టబద్ధం కావని తీర్పు చెప్పిన నేపథ్యంలో, బుధవారం కోర్టు ప్రభుత్వం వెంటనే రిఫండ్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. మొత్తం 13,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.11,90,531 కోట్లు) తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
మాన్హట్టన్లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. లక్షలాది షిప్మెంట్లకు సంబంధించిన ఖర్చులను మళ్లీ అంచనా వేయకుండా, వెంటనే ప్రవేశ ధరను ఖరారు చేసి వడ్డీతో సహా సుంకాలను తిరిగి చెల్లించాలని తెలిపారు. సాధారణంగా దిగుమతిదారులు వస్తువులు అమెరికాలోకి తీసుకురావడం సమయంలో అంచనా మొత్తాన్ని ముందుగా చెల్లిస్తారు. దాదాపు 314 రోజుల తర్వాత ఆ మొత్తాన్ని ఖరారు చేసే ప్రక్రియను లిక్విడేషన్ అని పిలుస్తారు.
కోర్టు ఆదేశాల ప్రకారం సుంకాల అంచనా ప్రక్రియను మళ్లీ చేయకుండా షిప్మెంట్లపై తుది ధరను నిర్ణయించి రిఫండ్లు ఇవ్వాలని అమెరికా కస్టమ్స్ అధికారులకు సూచించారు. ఎక్కువగా సుంకం చెల్లించిన దిగుమతిదారులకు రిఫండ్లు ఇవ్వడానికి అవసరమైన వ్యవస్థ ఇప్పటికే కస్టమ్స్ వద్ద ఉందని న్యాయమూర్తి తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!