
సినిమాలు

హైదరాబాద్లో కల్తీ నెయ్యి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు మరియు మార్కెట్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువ చేసే 200 కిలోల కల్తీ నెయ్యి, అలాగే నెయ్యి తయారీకి ఉపయోగిస్తున్న యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా కల్తీ ఆహార పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.









.png&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!