
సినిమాలు

కావేరి జల వివాదంపై తంజావూరులో జరిగిన డీఎంకే నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవేనని ఆరోపణలు రావడంతో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసుల చర్యలు, డీఎంకే కార్యకర్తల నిరసనలతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈ అంశంపై గాయని చిన్మయి శ్రీపాద, నటి-రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఘాటుగా స్పందించారు. రాజకీయాల కోసం మహిళలను లక్ష్యంగా చేసుకోవడం అంగీకారయోగ్యం కాదని, ప్రజా వేదికలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు పేర్కొన్నారు. త్రిషను అవమానించి ఉంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్ చేశారు. అయితే తాను కావేరి అంశాన్నే ప్రస్తావించానని, త్రిషను ఉద్దేశించి మాట్లాడలేదని ఉదయనిధి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!