
క్రీడలు

‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి, ఆ సినిమా తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి తాజాగా స్పందించింది. బోల్డ్ సన్నివేశాల్లో నటించినందుకు తనను విమర్శించిన వారిపై మాట్లాడిన ఆమె, మహిళలు ఏ పని చేసినా సమాజం వారిని సులభంగా జడ్జ్ చేస్తుందని వ్యాఖ్యానించింది.
తాను చేసే ప్రతి పనిలో పూర్తి నిజాయితీతో కష్టపడతానని తెలిపిన త్రిప్తి, ఒక స్టార్ హీరో బోల్డ్ పాత్రలు చేస్తే ప్రశంసలు అందుకుంటారని, అదే పని మహిళా నటులు చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. కొన్ని వ్యాఖ్యలు బాధ కలిగించినప్పటికీ, ఆ అనుభవాలను తన నటనలో చూపించడానికి ప్రయత్నిస్తానని ఆమె వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!