

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. ఈరోజు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, నిన్న రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు మరియు ఈరోజు నుంచి పెంచిన ధరలతో టికెట్లు విక్రయించేందుకు నిర్మాతలు ముందుగానే ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే ప్రీమియర్స్కు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం, నిన్న అర్ధరాత్రి తర్వాత టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 11 వ తేదీ వరకు మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.105, మల్టీప్లెక్స్లలో రూ.132 పెంచి టికెట్లు విక్రయించుకోవచ్చు. అలాగే 12 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్లలో రూ.89 పెంపునకు అనుమతి ఇచ్చారు. పెంచిన టికెట్ ధరల ద్వారా వచ్చే లాభంలో 20 శాతం ఫిలిం ఫెడరేషన్కు చెల్లించాలి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మారుతి దర్శకత్వంలో హారర్ ఫాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంగీతం అందించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!