
సినిమాలు

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రంలో టబు పాత్రను చిత్రబృందం పరిచయం చేసింది. ఇందులో ఆమె గౌరీ హెగ్డే అనే పవర్ఫుల్ డిప్యూటీ కమిషనర్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో టబు గంభీరమైన, శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు.
“ముందు కాలుస్తాం..తర్వాత మాట్లాడతాం..” అంటూ టబు చెప్పిన డైలాగ్ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా, టబు పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!