

టాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురువారం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఘన వేడుకలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వెండితెరపై అభిమానులను ఆకట్టుకున్న ఈ జంట నిజ జీవితంలోనూ జీవిత భాగస్వాములుగా మారడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. కలిసి నటించిన సినిమాల ద్వారా పరిచయమైన వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండగా, పెద్దల ఆశీర్వాదాలతో పెళ్లి పీటలెక్కారు.
‘విరోష్’ పేరుతో నిర్వహించిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సంప్రదాయ వేషధారణలో గుర్రంపై పెళ్లి మండపానికి చేరుకున్న విజయ్కు వధువు కుటుంబం ఘన స్వాగతం పలికింది. తెలుగు సంప్రదాయం ప్రకారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు జీలకర్ర–బెల్లం తంతుతో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అనంతరం సాయంత్రం కుటుంబ సంప్రదాయాల ప్రకారం వివాహ కార్యక్రమాలు కొనసాగాయి. సోషల్ మీడియాలో పంచుకున్న పెళ్లి ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటూ అభినందనల వెల్లువను తెచ్చాయి. మార్చి 4న హైదరాబాద్లో వివాహ విందు జరగనుంది.
పెళ్లి అనంతరం విజయ్ దేవరకొండ భావోద్వేగంగా స్పందిస్తూ రష్మిక తన జీవితానికి ఆనందం, ప్రశాంతతను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఆమె తన పక్కన ఉంటే ఎక్కడైనా ఇంటి అనుభూతి కలుగుతుందని చెప్పారు. మరోవైపు రష్మిక, విజయ్ను తన జీవితంలో ప్రతి విజయానికి ప్రేరణగా నిలిచిన వ్యక్తిగా అభివర్ణిస్తూ, నిజమైన ప్రేమ అర్థం నేర్పిన వ్యక్తి అతడేనని పేర్కొన్నారు. జీవితాన్ని కలిసి అత్యుత్తమంగా గడపాలని ఆశాభావం వ్యక్తం చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!