

నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “శ్రీ చిదంబరం గారు” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఫీల్ గుడ్ చిత్రమని అన్నారు. చింతా వరలక్ష్మీ సమర్పణలో, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చింతా వినీష్ రెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలుగా, చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 6 న విడుదల కానుంది.
కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు నిర్మాత తెలిపారు. దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడి పనిచేసిన టీమ్ను చూసి సినిమా బాధ్యత తీసుకున్నామని చెప్పారు. మారేడుమిల్లి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సహజమైన లొకేషన్స్లో చిత్రీకరించిన ఈ సినిమా ప్రశాంతమైన కథనంతో సాగుతుంది. ఫైట్స్, అతి ఆర్భాటం లేకుండా ప్రేక్షకులకు రిలాక్స్ ఇచ్చేలా సినిమా రూపొందించామని తెలిపారు.
ఇటీవల జరిగిన సెలబ్రిటీ షోలలో మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. సినిమా విడుదలకు ముందు ఓటీటీ డీల్ చేయకుండా, ముందుగా థియేటర్లలో కంటెంట్ చూపించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. విదేశాల్లో కూడా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తక్కువ టికెట్ ధర, మంచి ప్రొడక్షన్ విలువలతో “శ్రీ చిదంబరం గారు” ఒక అర్థవంతమైన సినిమా అవుతుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!