

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “మీట్ అవర్ వైజాగ్ హీరో” ఈవెంట్లో మాట్లాడిన హీరో అయాన్, ‘సింగ్ గీతం’లాంటి కాన్సెప్ట్తో ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదని అన్నారు. లెజెండరీ దర్శకుడి దర్శకత్వంలో తన తొలి చిత్రం చేయడం గొప్ప అదృష్టమని తెలిపారు.
అహల్యా బమ్రూ మాట్లాడుతూ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నానని, వైజయంతి మూవీస్లో నటించడం కల నిజమైనట్టేనని చెప్పారు. శాలిని కొండేపూడి తన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని వెల్లడించారు. లైవ్ వీడియో కాల్లో పాల్గొన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ‘సింగ్ గీతం’ పూర్తి స్థాయి మ్యూజికల్ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. జూన్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!