

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన విభిన్న కథనం, బోల్డ్ యాక్షన్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న వంగా.. తాజాగా తాను నిర్మిస్తున్న రోమాంచకం ట్రైలర్ లాంచ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పిరిట్ సర్టిఫికేషన్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రోమాంచకం చిత్రానికి తన బ్యానర్లో తొలిసారి క్లీన్ U/A సర్టిఫికేట్ వచ్చిందని తెలిపారు. అయితే స్పిరిట్లో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో A సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
స్పిరిట్లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రా అండ్ రస్టిక్ లుక్తో పాటు ఇప్పటివరకు చూడని భిన్నమైన షేడ్స్లో ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. యానిమల్ చిత్రానికి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్పిరిట్ 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!