
బిజినెస్

తీర్థ క్రియేషన్స్ బ్యానర్పై పార్ధసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సందిగ్ధం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 29 న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ చిన్న సినిమాలకు ప్రమోషన్, రిలీజ్ విషయంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ మీడియా, ప్రేక్షకులు సహకరించాలని కోరారు. చిత్ర యూనిట్ సభ్యులు సినిమా మంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అడవి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భావోద్వేగాలతో నిండిన థ్రిల్లర్గా ఉంటుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!