

వివాహ బంధం ముగిసిన తర్వాత ఇక ఎవరినైనా నమ్మడం కష్టమైందని, కానీ దర్శకుడు రాజ్ నిడుమోరుతో పరిచయం తన జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చిందని స్టార్ హీరోయిన్ సమంత వెల్లడించారు. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాగచైతన్యతో విడాకులు మరియు మయోసైటిస్తో పోరాటం తర్వాత తాను తనతోనే ఎక్కువ సమయం గడుపుతూ జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకున్నానని తెలిపారు. రాజ్ పరిచయం తర్వాత కలిసి పని చేయడం, వ్యాయామం చేయడం, ప్రయాణాలు చేయడం వంటి విషయాలు తమ బంధాన్ని మరింత బలపరిచాయని చెప్పారు.
అలాగే నటిగా తనలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయని సమంత పేర్కొన్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం చిత్రంలో చీర కట్టుకుని ఫైట్ సీక్వెన్స్ చేయడం తనకు కొత్త అనుభవమని తెలిపారు. భారీ యాక్షన్ సన్నివేశాన్ని కేవలం ఐదు గంటల్లో పూర్తి చేశామని వెల్లడించారు. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తుండగా, సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!