

సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో దర్శకుడు ఆర్జే బాలాజీ సీక్వెల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, సినిమా విజయాన్ని వెంటనే సీక్వెల్గా మార్చి లాభపడాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ కథ భావనతో మరికొంతకాలం జీవించాలని అనుకుంటున్నానని, అందుకే వెంటనే రెండో భాగం చేయాలనే ఒత్తిడిని పట్టించుకోవడం లేదని తెలిపారు.
అలాగే ఈ కథను మొదట విజయ్ దళపతి కోసం రాసినట్టు బాలాజీ వెల్లడించారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ ప్రాజెక్ట్ సాధ్యపడలేదని చెప్పారు. సూర్యతో ఎప్పుడైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం రాజకీయ నేపథ్యంలోని సినిమా చేయడానికి సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడపాలని భావిస్తున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!