

పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న మరో అరుదైన గౌరవాన్ని అందుకొని వార్తల్లో నిలిచింది. అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ స్టార్ హీరోయిన్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా తన ప్రతిభను చాటుతోంది. జపాన్లో నిర్వహించే ప్రతిష్టాత్మక క్రంచిరోల్ ఆనిమే అవార్డ్స్లో వరుసగా రెండోసారి ప్రజెంటర్గా ఎంపిక కావడం ద్వారా రష్మిక ప్రత్యేక రికార్డు సృష్టించింది. ఈ అవార్డ్స్ వేదికపై రెండుసార్లు ప్రజెంటర్గా నిలిచిన తొలి భారతీయ సినీ ప్రముఖురాలిగా ఆమె గుర్తింపు పొందింది.
వచ్చే నెల 23 న టోక్యోలో జరగనున్న ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో కలిసి రష్మిక అవార్డులను అందజేయనుంది. పుష్ప: ది రైజ్ లో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్ర జపాన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం వల్ల అక్కడ ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండతో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక, లేడీ ఓరియెంటెడ్ మరియు పాన్ ఇండియా సినిమాలతో తన కెరీర్ను మరింత ముందుకు తీసుకెళ్తోంది. వరుస విజయాలతో అంతర్జాతీయ స్థాయిలో మెరవుతున్న ఈ నేషనల్ క్రష్ మరింత ఎత్తుకు ఎదుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!