

నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మైసా సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన ఆమె.. వైద్యుల సూచనల మేరకు కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉంటూ తన ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేసి త్వరలోనే షూటింగ్కు తిరిగి వస్తున్నట్లు వెల్లడించారు.
ఈ గ్యాప్లో గడిపిన ప్రశాంతమైన క్షణాలను మిస్ అవుతానని రష్మిక తెలిపారు. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో పూజల్లో పాల్గొనడం, ఆత్మీయులతో సమయం గడపడం, ప్రకృతిని ఆస్వాదించడం, పెంపుడు కుక్కతో సరదాగా గడపడం వంటి క్షణాలు కనిపించాయి. రష్మిక త్వరలోనే సెట్స్లోకి రాబోతున్నారనే వార్తతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మైసా, రణబాలి వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, రాకా అనే మరో క్రేజీ సినిమాలోనూ నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!