
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి ది సావేజెస్ ఓత్ పేరుతో టీజర్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది.
విడుదలైన కొద్ది సమయంలోనే టీజర్ యూట్యూబ్లో నంబర్ వన్ ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే 2.6 కోట్ల డిజిటల్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. టీజర్కు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!