
జనరల్

సినీ కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉండగానే ప్రజాసేవ కోసం నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం హర్షణీయమని నటుడు రామ్చరణ్ అన్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన తన తాజా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై ఆయన కీలక విషయాలు పంచుకున్నారు.
చెన్నై తనకు సొంత ఊరిలా అనిపిస్తుందని, తన కుటుంబానికి ఈ నగరంతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ‘పెద్ది’ కోసం టీమ్ రెండున్నరేళ్లు కష్టపడ్డారని, తాను 285 రోజులు షూటింగ్లో పాల్గొన్నానని చెప్పారు. బుచ్చిబాబు కృషి, ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ, శివరాజ్కుమార్ నటనపై ప్రశంసలు కురిపించారు. జాన్వీకపూర్ నిబద్ధత కలిగిన నటిగా ప్రశంసిస్తూ, ‘పెద్ది’ ఒక అద్భుతమైన ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!