

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో ప్రేక్షకులు వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని చూడబోతున్నారని నిర్మాతలు తెలిపారు. ఇది పూర్తిగా క్లీన్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఉంటుందని, పిల్లలు నుంచి పెద్దల వరకూ అందరూ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయగల చిత్రమని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండగా, నయనతార కథానాయికగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12 న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
సెన్సార్ నుంచి మంచి రిపోర్ట్ రావడంతో పాటు ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్తోందని నిర్మాతలు తెలిపారు. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కలిసి చేసిన సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించనున్నాయని, సినిమాలో ఫన్, యాక్షన్, ఎమోషన్ అన్నీ సమపాళ్లలో ఉంటాయని పేర్కొన్నారు. వెంకటేష్ పాత్ర ఎంటర్టైన్మెంట్ను మరింతగా పెంచుతుందని, చిరంజీవి పాత్రలో వింటేజ్ ఛార్మ్తో పాటు కొత్త స్టైల్ కూడా కనిపిస్తుందని తెలిపారు. భీమ్స్ సంగీతం, సమీర్ రెడ్డి విజువల్స్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు.
ఈ సినిమా చిరంజీవి అభిమానులకు నిజమైన సంక్రాంతి విందుగా ఉంటుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి సీన్లో నవ్వులు పూయించేలా ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన కథను అనిల్ రావిపూడి తెరకెక్కించారని అన్నారు. చిరంజీవి, వెంకటేష్ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ హైలైట్గా నిలుస్తాయని, ప్రేక్షకులు చిరంజీవి నుంచి మిస్ అయిన పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ను ఈ సినిమాలో మళ్లీ చూడగలరని నిర్మాతలు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!