

ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధి జి. ధనుంజయన్ ఇటీవల విడుదలైన ‘సర్దార్ 2’ ఓవర్సీస్ ప్రీమియర్ షోల రివ్యూలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ నిర్మాణ విలువలు, తండ్రీకొడుకుల సెంటిమెంట్తో రూపొందిన ఈ సినిమా పర్ఫెక్ట్ కమర్షియల్ సీక్వెల్గా ఉందని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తున్నప్పటికీ.. సినిమా విడుదలకు ముందే కొందరు రివ్యూయర్లు నెగెటివ్ నరేటివ్ను సెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్లో ఉదయం 9 గంటలకు షోలు ప్రారంభం కాకముందే వచ్చే ముందస్తు సోషల్ మీడియా రివ్యూలు సాధారణ ప్రేక్షకులపై ప్రభావం చూపుతున్నాయని ధనుంజయన్ అన్నారు. దీనివల్ల సినిమాను నమ్ముకున్న నిర్మాతలకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. అందుకే యూఎస్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ముందస్తు ప్రీమియర్ షోలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రేక్షకులు సినిమా ఫలితాన్ని అంచనా వేయడానికి కనీసం ఒక రోజు సమయం ఇవ్వాలని, విదేశాల్లోనూ భారత కాలమానం ప్రకారమే ఏకకాలంలో షోలు ప్రారంభమయ్యేలా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ద్వారా ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!