

ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. విరామం లేకుండా చిత్రీకరణను పూర్తి చేసి, సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జోడిగా ఇమాన్వి నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టి–సిరీస్కు చెందిన గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు ఛాయాగ్రహణం – సుదీప్ ఛటర్జీ, సంగీతం – విశాల్ చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైన్ – అనిల్ విలాస్ జాదవ్, కూర్పు – కోటగిరి వెంకటేశ్వరరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!