

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం. కథలో కొత్తదనం, ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించే అంశాలకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘సేవ్ ది టైగర్స్’ ఫేమ్ దర్శకుడు తేజ కకొమా చెప్పిన కథ సాయి దుర్గ తేజ్ను ఆకట్టుకున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘పార్వేట’ అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో దర్శక ద్వయం సుజిత్-సందీప్ చెప్పిన మరో కథకు కూడా సాయి దుర్గ తేజ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వరుసగా భిన్నమైన కథలను ఎంచుకుంటున్న ఆయన కెరీర్లో ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!