

అదోనై పిక్చర్స్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందిన “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” అనే రెండు స్వతంత్ర పాటల లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ దర్శకత్వంలో అంకిత జాదవ్, రోహిత్ భోగ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ పాటలను కేకే రెడ్డి నిర్మించగా, జయంత్ ఆర్యన్ సంగీతం అందించారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించగా, లిప్సిక, అదితి భావరాజు గానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సత్య మాస్టర్, నిర్మాత కేకే రెడ్డి పాటల రూపకల్పనలోని కృషి, ప్యాషన్ను వివరించారు. తక్కువ మంది క్రూతో, తక్కువ సమయంలో ఈ పాటలను పూర్తి చేసినట్లు తెలిపారు. దర్శకులు సాయి రాజేశ్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నటి అషురెడ్డి తదితరులు పాటల విజువల్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీని ప్రశంసించారు. ఈ పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకాన్ని టీమ్ వ్యక్తం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!