

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ఓటీటీ హక్కులపై గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుందనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ‘సూపర్ సుబ్బు’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నెట్ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఈ ప్రచారంపై స్పందిస్తూ, ప్రస్తుతం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదని స్పష్టం చేశారు.
‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులపై తాను ఎక్కడా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని మోనికా షెర్గిల్ తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై వ్యాఖ్యానించలేనని చెప్పడంతో, ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇదే సమయంలో దక్షిణాది సినిమాలపై నెట్ఫ్లిక్స్ మరింత దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఏయే భారీ చిత్రాలకు డిజిటల్ ఒప్పందాలు కుదురుతాయనే అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!