

సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలపై మొదట మంచి టాక్ వచ్చినా, కొందరు కావాలనే వాటిని నెగెటివ్గా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. నటీనటులు, దర్శక నిర్మాతలపై విమర్శలు చేస్తూ యూట్యూబ్, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ సెలబ్రిటీలను తీవ్రంగా బాధపెడుతున్నారు. కొంతమంది నటులు వీటిని పట్టించుకోకపోయినా, మరికొందరు మాత్రం పోలీస్ కేసులు వరకు వెళ్లి నెగెటివిటీ చేసే వారికి గట్టిగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి ట్రోలింగ్ తగ్గడం లేదు.
తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై కూడా నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్–బుచ్చిబాబు సనా కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ ఐదు భాషల్లో 150 మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండింగ్లో ఉంది.
అయితే ఈ పాటపై కొందరు నెగెటివ్ వీడియోలు చేయడంతో, ఈ విషయం తెలుసుకున్న విశ్వక్ సేన్ తీవ్రంగా స్పందించారు. ఇండస్ట్రీ వల్లే జీవనం సాగిస్తూ, అదే ఇండస్ట్రీని కించపరచడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా విడుదల కాకముందే దానిని నాశనం చేయాలని ప్రయత్నించే వారిని పరాన్నజీవులుగా అభివర్ణించారు. ట్విట్టర్లో నెగెటివిటీ సృష్టిస్తున్న వీడియోను షేర్ చేస్తూ మండిపడ్డారు. విశ్వక్ సేన్ స్పందనకు మెగా అభిమానులు మద్దతుగా నిలుస్తూ, రామ్ చరణ్ సినిమాపై నెగెటివిటీ చేసే వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!