
గాసిప్స్

సీనియర్ హీరో అర్జున్ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఐశ్వర్య కథానాయికగా నటించిన ‘సీతా పయనం’ సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెలుగులో చేసిన మొదటి సినిమాకు రూ.25 వేల పారితోషికం అందుకున్నానని తెలిపారు. చిన్న వయసులోనే ఎక్కువ డబ్బు రావడంతో దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియక కొన్ని ఆర్థిక నిర్ణయాల్లో తప్పులు జరిగాయని చెప్పారు.
అంతేకాక, తన చుట్టూ ఉన్న కొంతమంది మోసం చేయడంతో పెద్ద నష్టాలు ఎదుర్కొన్నానని అర్జున్ వెల్లడించారు. ఆ ఆస్తులు ఇప్పుడు ఉంటే తాను మరో స్థాయిలో ఉండేవాడినని పేర్కొన్నారు. సీనియర్ నటుడు శోభన్బాబు తనకు ఎంతో దగ్గరగా ఉండి ఎన్నో సలహాలు ఇచ్చినా అప్పట్లో వాటిని పట్టించుకోలేదని, ఇప్పుడు వాటి విలువ తెలుసుకుందామని చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!